ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. పాజిటివ్ అజెండా ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు. విపక్షాలు కూటమిగా వచ్చాయని, సొంతంగా పోటీ చేసే ధైర్యం కూడా లేదని ఎద్దేవా చేశారు.