ఏపీ సీఎం చంద్రబాబు 'తల్లికి వందనం'పై మరోసారి అప్డేట్ ఇచ్చారు. మే నెలలో విద్యార్థులకు 'తల్లికి వందనం' పథకం అమలు చేస్తామని తెలిపారు. రూ.15 వేల చొప్పున ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికీ అందిస్తామన్నారు. పాఠశాలలు తెరిచేలోగానే ఆకౌంట్లలో డబ్బులు వేస్తామని హామీ ఇచ్చారు.