AP: గుంటూరు మిర్చి యార్డులో బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ రైతులను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా? అని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం అబ్దుల్ నజీర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు.