యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్తున్న రేపిస్టును పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన రమేశ్ సింగ్ 2003లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి పదేళ్లు జైలుకెళ్లొచ్చాడు. 2014లో ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం చేసి ఆధారాలు లేక 2019లో జీవితఖైదు శిక్ష నుంచి బయటపడ్డాడు. తాజాగా ఫిబ్రవరి 2న 11 ఏళ్ల బాలికను హత్యాచారం చేశాడు. ఆపై ప్రయాగ్రాజ్కు వెళ్తుండగా జైపూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.