స్నేహితుడిని హత్య చేసిన షణ్ముఖ్

16846చూసినవారు
విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. ఫోటోషూట్‌కని తీసుకెళ్లిన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 26న షణ్ముఖ్, సాయి విజయ్ ఫోటో‌షూట్ కోసం రావులపాలెం వెళ్లారు. అక్కడ ఏమైందో తెలియదు.. షణ్ముఖ్ తన స్నేహితుడు సాయి విజయ్‌ను హత్య చేశాడు. సాయి విజయ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్