సీఎం జగన్పై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో నిర్వహించిన ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ.. "కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్నారు.. కనీసం మంచినీళ్లు లేవు. ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు.. ఏదీ ఎక్కడా కనపడదే? ఆర్టీసీ, విద్యుత్తో పాటు అన్నింటి ఛార్జీలు పెంచారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయల్దేరారు." అని ఫైర్ అయ్యారు.