కడప జిల్లా నేతలతో ముగిసిన షర్మిల భేటీ

73చూసినవారు
కడప జిల్లా నేతలతో ముగిసిన షర్మిల భేటీ
కడప జిల్లా నేతలతో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల భేటీ ముగిసింది. తాను కడప నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు రాగానే స్పష్టత ఇస్తానని అన్నారు. ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు వచ్చిన అప్లికేషన్‌‌లు పరిశీలిస్తున్నామని చెప్పారు. అధిష్టానం క్లియరెన్స్ ఇవ్వగానే అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్