ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ రాజీనామ చేయనున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఆశించిన ఆయనకు నిరాశే మిగిలింది. కుమారుడు రుద్ర ఒత్తిడితో అనుచరులతో కలిసి ప్రభాకర్ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.