జాతీయ లోక్ అదాలత్ ను సందర్శించిన విద్యార్థులు

57చూసినవారు
జాతీయ లోక్ అదాలత్ ను సందర్శించిన విద్యార్థులు
కందుకూరు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని క్షేత్ర పర్యటనలో భాగంగా శనివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొని కేసుల సరళి, కోర్టు ప్రొసీడింగ్స్, కేసుల రాజీ పద్ధతి, ఉచిత న్యాయ సహాయం, న్యాయవ్యవస్థ పనితీరుని నిశితంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్