నెల్లూరు నగరంలోని షాదీ మంజీల్ లో జరుగుతున్న ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన మైనార్టీలు పెద్ద ఎత్తున ఒక్కసారిగా కాబోయే సీఎం బాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీల అభివృద్ధి టిడిపి ద్వారానే సాధ్యమన్నారు.