కందుకూరు ప్రాంతానికి చెందిన మాజీ జడ్పిటిసి మల్లవరపు సుబ్బారెడ్డి( కరెంటు సుబ్బారెడ్డి) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసానికి చేరుకున్న మల్లవరపు సుబ్బారెడ్డి ఈ మేరకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం పార్టీ కండువా కప్పుకున్నారు.