అమరావతిలోని ఉండవల్లి సీఎం నివాసంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో పురపాలకశాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ 14 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఆర్యవైశ్యసంఘం రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నారా లోకేష్ నూతనంగా చేరిన వైసీపీ కార్పొరేటర్లకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.