నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేంచేసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో మంగళవారం పౌర్ణమి తిధి సంధర్బంగా ఉదయం ఉత్సవ మూర్తులకు అభిషేకం, సాయంత్రం గరుడ సేవ గిరిప్రదక్షిణను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయ కర్తలుగా నెల్లూరు వాస్తవ్యులు మన్నెం జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి. గిరికృష్ణ దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.