డివైడర్ ఢీకొన్న మోటర్ సైకిల్: ఇద్దరు యువకులు మృతి
మనుబోలు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన బండి వేణు (18) ఆకాష్ లు మృతి చెందినారు. ఈ ఇద్దరు మోటార్ సైకిల్ పై నెల్లూరు వెళ్లి అక్కడ ఫైనాన్షియల్ కంపెనీలో మోటార్ సైకిల్ కు ఫైనాన్స్ నగదు చెల్లించి, తిరిగి వస్తుండగా బ్యాంకు వద్ద డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడి చనిపోయారు.