తన సొంత లాభాన్ని సైతం మరచి ప్రజల సంక్షేమం కోసం కష్టపడే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. రాబోయే ఎన్నికల్లో ఆయనకు మళ్ళీ ఓటు వేసి ముఖ్యమంత్రిగా గెలిపించుకోకపోతే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు అనేది ఉండదని ఉరుకుంటపాడు మండలం మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్ అన్నారు. మండలంలోని డక్కునూరులో శుక్రవారం ఆయన పర్యటించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించి జగన్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు.