సీతారాంపల్లి గ్రామంలో పట్ట పగలే చోరీ

85చూసినవారు
సీతారాంపల్లి గ్రామంలో పట్ట పగలే చోరీ
ధర్మవరం మండలం సీతారాంపల్లి గ్రామంలో గురువారం పట్ట పగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడి వివరాల మేరకు వసంతరెడ్డి అనే రైతు తోటలో పనుల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లాడు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో 5 తులాల బంగారం, రూ. 80 వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్