గుత్తి సమీపంలోని పెట్రోల్ బంకులో చోరీ

69చూసినవారు
పెట్రోల్ బంకులో గుర్తు తెలియని దుండగుడు చోరీ చేసిన సంఘటన గుత్తి పట్టణ శివారులో గల ఓ పెట్రోల్ బంకులో శనివారం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగుడు పెట్రోల్ బంకు వద్ద ఎవరూ లేని సమయంలో బంకులోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్ లోని రూ.8400 ఎత్తుకెళ్లాడు. కాగా దుండగుడు చోరీ చేస్తున్న దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ ఘటనపై బంకు నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్