వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను తనిఖీ చేయాలని సచివాలయం వద్దకు చేరుకోవాలని మంగళవారం కొంతమంది అధికారులు సమాచారం అందించారు. దీంతో వృద్ధులు, వికలాంగులు, 9 గంటలకే లేపాక్షి పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పెన్షన్ల తనిఖీలు నిర్వహించాల్సిన వెలుగు సిబ్బంది 12 గంటలైనా రాకపోవడంతో వృద్ధులు పడిగాపులు కాశారు. ఉదయం నుంచి 12 గంటల వరకు ఏ అధికారి రాలేదని వారు వాపోయారు.