నా భర్త ఉద్యోగం నాకు ఇప్పించండి

60చూసినవారు
అమడగూరు మండలం కసముద్రం గ్రామానికి చెందిన సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రభాకర్ 2022 మార్చి నెలలో రోడ్డు ప్రమాదానికి గురై మంచానపడ్డాడు. ఈ సందర్భంగా ఆయన భార్య మాట్లాడుతూ వైద్యులు బ్రెయిన్ డెడ్ అని చెప్పారని దాదాపు 30 లక్షలు ఖర్చు అయిందని, ప్రస్తుతం మా వద్ద ఏమీ లేదని తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆవేదన చెందింది. అధికారులు స్పందించి నా భర్త ఉద్యోగం తనకు ఇప్పించాలని వేడుకుంది.

సంబంధిత పోస్ట్