కళ్యాణదుర్గంలో కన్నుల పండుగగా వినాయక నిమజ్జన కార్యక్రమం

549చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో పలు కాలనీలలో కూర్చోపెట్టిన వినాయక విగ్రహాలను ట్రాక్టర్ల పై ముస్తాబు చేసి సోమవారం ప్రధాన సర్కిళ్ల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ట్రాక్టర్ల ముందు యువత, మహిళలు డ్రమ్స్ వాయిద్యాలకు నృత్యాలు చేయడం పలువురుని ఆకట్టుకున్నాయి. పట్టణ శివార్లలో ఉన్న చెరువులలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డిఎస్పి తన సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్