శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలను శనివారం పి. నరసింహప్ప దాఖలు చేశారు. ఈ సందర్బంగా పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అపూర్వ భరత్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది లక్ష్మినారాయణ, నాయకులు గంగాధర్, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.