మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు, లోకేశ్ నిరంతరం పరితపిస్తారని నారా బ్రాహ్మణి అన్నారు. "డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే చంద్రబాబే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో మొదటి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది ఆయనే. పేద ప్రజలకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకే సూపర్-6 పథకాలను ప్రకటించారు." అని బ్రాహ్మణి పేర్కొన్నారు. మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఈ మేరకు మాట్లాడారు.