సీఎం జగన్పై జరిగిన రాయి దాడి టీడీపీ కుట్రేనని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమ రాయితో దాడి చేయించారని ఆరోపించారు. ఈ దాడిపై టీడీపీ దుష్ప్రచారం చేయడంపై బాధగా ఉందని చెప్పారు. "కంట్లో నలుసుపడితేనా అల్లాడిపోతాం. అలాంటిది కంటికి జరిగిన రాయి దాడితో సీఎం, నేను ఇబ్బంది పడుతుంటే టీడీపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతవరకు సబబు." అని వ్యాఖ్యానించారు.