దేశవ్యాప్తంగా తొలివిడత ఓటింగ్ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో తళుక్కున మెరిసిన ఓ పోలింగ్ ఏజెంట్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈశా అరోరా. యూపీలోని సహరణ్పుర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని గంగోహ్ ప్రాంతంలో ఈశా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఓటింగ్కు ముందు ఈవీఎం బాక్సులు తీసుకుని ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.