మోటువారిపల్లిలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

1556చూసినవారు
పెనుకొండ మండలం మోటువారిపల్లిలో శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయం వద్ద గ్రామస్థులు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాములు కల్యాణాన్ని తిలకంచారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్