పుట్టపర్తి: అమరవీరులసంస్మరణ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
"అశువులు బాసిన పోలీస్ అమరవీరులకు జోహార్లు"

పోలీస్ అమరవీరుల సంస్మరణ వరోత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు నిర్వహించి స్మతి పరేడ్‌, పోలీసు అమరులకు నివాళులు, శ్రద్ధాంజలి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసుల త్యాగాలు మరువలేనివని అన్నారు. తాను కూడా ఒక పోలీస్ అధికారి బిడ్డనే అని మీ సమస్యలు పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో అమరులైన నియోజకవర్గానికి చెందిన పోలీస్ అధికారులు చంద్ర శేఖర్, బాబా ఫక్రుద్దిన్ కుటుంబాలకు అండగా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున రెండు కుటుంబాలకు నలభై వెల రూపాయల నగదు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్