ఆత్మకూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

70చూసినవారు
ఆత్మకూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే
ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎన్నికల ముందు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సిమెంట్ రోడ్లు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్