అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

67చూసినవారు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నార్పల మండలం బి. పప్పూరుకు చెందిన కుళ్లాయప్ప ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివారులో రెండెకరాల పొలం ఉంది. పొలంలో వేరుసెనగ, టమాటా, మిరప పంటలు సాగు చేసేవాడు. పంటల సాగుకు, కుటుంబ పోషణకు దాదాపుగా రూ. 8 లక్షల అప్పులు చేశాడు. అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేయడంతో మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య నారాయణమ్మ ఫిర్యాదుతో నార్పల ఎస్సై సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్