అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్

50చూసినవారు
అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్
అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని శనివారం పోలీసులు రిమాండ్ కు తరలించారు. పెద్దపప్పూరు మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై పెదనాన్న కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై బాలిక ఫిర్యాదు మేరకు ఈనెల 26న పెద్దపప్పూరు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ గౌస్ బాషా తెలిపారు.

సంబంధిత పోస్ట్