తాడిపత్రి పట్టణంలోని 30వార్డు సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులో వుండేలా మార్చాలని ఆవార్డు కౌన్సిలర్ మల్లికార్జున శనివారం మున్సిపల్ కమీషనర్ శివరామకృష్ణను కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మల్లికార్జున మాట్లాడుతూ 30వవార్డు సచివాలయం ఒకటిన్నర కిలోమీటర్ దూరం వుండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావునా ప్రజల ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని సచివాలయాన్ని అందుబాటులో వుండేలా చూడాలని ఆయన కమీషనర్ను కోరారు.