ఉరవకొండ: గవి మఠం చంద్రన్న మృతి తీరని లోటు

66చూసినవారు
ఉరవకొండ: గవి మఠం చంద్రన్న మృతి తీరని లోటు
ఉరవకొండ పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందిన గవి మఠం స్థిత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో నిత్య అన్నదాన సత్రంలో వంట మనిషిగా పనిచేస్తున్న చంద్రన్న (60) ఆదివారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గవి మఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్ర స్వామి మాట్లాడుతూ 35 ఏళ్ల నుంచి అన్నదానం సత్రంలో వంట చేస్తూ ఎందరో పేద విద్యార్థులకు ఆకలిని తీర్చారనట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్