శ్రీ బాలా త్రిపుర సుందరిగా జగదీశ్వరి అమ్మవారు

58చూసినవారు
శ్రీ బాలా త్రిపుర సుందరిగా జగదీశ్వరి అమ్మవారు
ఉరవకొండ పట్టణంలోని గుంతకల్లు రోడ్డు వద్ద వెలసిన శ్రీ జగదీశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్న నవరాత్రుల ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం ఆలయ ధర్మకర్త గాజుల శ్యామల ఆధ్వర్యంలో రుద్ర సహిత మహా చండీ హోమం, నవదుర్గ హోమం నిర్వహించారు. వందలాదిమంది భక్తాదులకు అన్నదాన కార్యక్రమం ధర్మకర్త చేతుల మీదుగా ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్