ఉరవకొండ: కొండపై చిరుత సంచారం

62చూసినవారు
వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురంలో చిరుత సంచరిస్తోందని గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానిక రామప్ప కొండపై సోమవారం ప్రజలకు చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు. దీంతో కొండ సమీపంలోని ప్రజలు, అక్కడే ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రివేళ ఆవులు, గొర్రెలపై చిరుత ఎక్కడ దాడి చేస్తుందో అని భయంతో కర్రలు పట్టుకొని కాపలా ఉన్నారు. అటవీ సిబ్బంది చిరుతను బంధించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్