ఆముదాలవలస మండలంలోని 30 గ్రామపంచాయతీల్లో శుక్రవారం నిర్వహించనున్న గ్రామసభలకు పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో వాసుదేవరావు తెలిపారు. గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకానికి 2024- 25 ఏడాదికి కొత్త పనులను గుర్తించాలని సూచించారు. ప్రతి పంచాయతీలో ఉదయం 10 గంటలకు పక్కాగా గ్రామసభ నిర్వహణ జరగాలని సూచించారు.