వరద బాధితులకు సహాయం అందించిన పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు

52చూసినవారు
వరద బాధితులకు తన వంతు సాయంగా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ ఈస్ట్ 16వ డివిజన్లో మంగళవారం నష్టం అంచనాలో భాగంగా తనను నియమించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో నష్టం అంచనాను వేయటమే కాకుండా నిరుపేదలకు తన వంతు నగదు సహాయం అందజేస్తున్నానని ఆయన తెలియజేశారు. పకడ్బందీగా నష్టం అంచనాను వేస్తున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్