సంతబొమ్మాళి మండలం గొల్లసీతాపురానికి చెందిన బొమ్మాళి బాలరాజు(30) అనే యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో మంగళవారం కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. టెక్కలి పంచాయతీ కార్యాలయం పరిధిలో కాంట్రాక్ట్ ఎలక్ట్రిషియన్ విధులు నిర్వహిస్తున్న అతడు గత నెల 31వ తేదీన విద్యుత్ స్తంభం నుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.