ఎమ్మెల్యేను కలిసిన పలువురు అధికారులు

66చూసినవారు
ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును పలువురు అధికారులు, కూటమి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఉదయం రణస్థలం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈశ్వరరావును విజయనగరం డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, జి. సిగడాం మండల ఎంపీడీఓ వెంకన్నబాబు, పలువురు అధికారులు, కూటమి నేతలు కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. దింతో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్