గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తి మృతి

53చూసినవారు
అనకాపల్లి జిల్లా యలమంచిలిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి ఆదివారం మృతి చెందాడు. ఇచ్ఛాపురం మండలం కొఠారి పంచాయతీ పత్రిపుట్టుగ గ్రామానికి చెందిన బదకల కేశవరావు కొత్తూరు సమీపంలోని ఓ సిమెంట్‌ ఇటుకల తయారీ పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్యాస్‌ వాసన రావడంతో లైట్‌ స్విచ్‌ ఆన్ చేయడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్