నువాగడాలో వైసిపి ఇంటింటా ప్రచారం

64చూసినవారు
కంచిలి మండలంలోని నువాగడ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి నాయకులతో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల తరఫున శుక్రవారం ఇంటింటా ప్రచారం చేసారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యేగా పిరియా విజయ, శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్