మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలి

73చూసినవారు
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలి
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే శతశాతం అభివృద్ధి జరిగిందని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఆమె బుధవారం పాతపట్నం మండలంలోని పాసి, గంగుపేట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి మళ్ళీ పట్టం కట్టాలని కోరారు. పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పాతపట్నం నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తనను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్