గడచిన ఐదు సంవత్సరాలగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులతో కలిసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ఈ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో తమ ప్రయాణం మరో ఐదు సంవత్సరాలు పాటు కొనసాగాలని ఆకాంక్షించారు. తమ ఓటును వైసీపీకి వేయాలని అభ్యర్థించారు.