మహాత్మా గాంధీజీ సేవలు చిరస్మరణీయం.. మంత్రి అచ్చన్న

83చూసినవారు
మహాత్మా గాంధీజీ సేవలు చిరస్మరణీయం.. మంత్రి అచ్చన్న
మహాత్మా గాంధీజీ సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉండిపోతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశానికి చేసిన సేవలను నేటి తరం యువతకు తెలియ చెప్పవలసిన అవసరం నేడు ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్