శోకసంద్రంలో వీర జవాన్ జగదీశ్వరరావు కుటుంబం

56చూసినవారు
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం వల్లభరాయుడుపేటకు చెందిన జవాన్ సనపల జగదీశ్వరరావు (40) మరణంతో మంగళవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులలో జవాన్ మృతితో కన్నీటి పర్యంతం అవుతున్న కుటుంబ సభ్యులను గ్రామస్థులు ఓదార్చారు. కాగా వీరమరణం పొందిన జవాన్ మృతి పట్ల జిల్లాలోని పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్