ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు
కోటబొమ్మాలి మండలం పాకివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే నేషనల్ హైవే సిబ్బంది అంబులెన్స్ లో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటబొమ్మాలి పోలీసులు కేసు నమోదు చేశారు.