టెక్కలి జాతీయ రహదారిపై మామిడి పండ్ల వ్యాన్ బోల్తా
టెక్కలి జాతీయ రహదారిపై శనివారం ఉదయం విజయనగరం నుంచి జార్ఖండ్ వెళ్తున్న మామిడిపండ్ల లోడుతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే అని తెలుస్తోంది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే క్రేన్ సాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.