ఏపీ ప్రభుత్వంతో ఇవాళ జరిగిన చర్చలు తమను నిరాశకు గురిచేశాయని APJAC నేతలు తెలిపారు. మధ్యంతర భృతి విషయంలో ప్రభుత్వం స్పందించలేదని జేఏసీ నేత బండి శ్రీనివాస్ చెప్పారు. మా ఉద్యమ కార్యాచరణ ముందుగా చెప్పిన ప్రకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27న ఉద్యోగులతో చలో విజయవాడకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 14న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్నారు.