ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంట పాలెంలో టీడీపీ నేత కారును గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. చిగురుపాటి శేషగిరి తన ఇంటి వద్ద కారు పార్క్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.