టీ బ్రేక్.. ఇంగ్లాండ్ 172-5

57చూసినవారు
టీ బ్రేక్.. ఇంగ్లాండ్ 172-5
ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి 172–5 స్కోరు చేసింది. క్రీజులో ఓలీ పోప్ 67, బెన్ ఫోక్స్ 2 ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు ఇంకా 18 పరుగులు వెనకబడి ఉంది. జాక్ క్రాలే 31, బెన్ డకెట్ 47, జో రూట్ 2, బెయిరిస్టో 10, స్టోక్స్ 6 పరుగులకు ఔటయ్యారు. బుమ్రా, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీయగా, జడేజా ఒక వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్