తూర్పు గోదావరి జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. పెదకొండేపూడిలో ఓ వ్యక్తి తన భార్యకు శిరోముండనం చేయించాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇష్టం లేదంటూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. భార్యకు శిరోముండనం చేసిన భర్త కర్రి అభిరామ్ ఊరంతా తిప్పిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.