సీఎం జగన్పై దాడి కేసులో పోలీసులు కీలక సమాచారాన్ని గుర్తించారు. ఐదుగురు యువకులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ ఐదుగురిలో ఒక యువకుడు సీఎం జగన్పై రాయితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ వీడియోల్లో యువకుడిని గుర్తించినట్లు సమాచారం. ఆ యువకుడు అజిత్సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్గా గుర్తించారు. దాడి చేయడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.